Share News

42 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక

ABN , Publish Date - Jun 10 , 2024 | 12:02 AM

42 ఏళ్ల కిందట విడిపోయిన పూర్వ విద్యార్థులు మళ్లీ కలుసుకోవడానికి స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వేదికయ్యింది.

42 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక
ఉపాధ్యాయులతో కలసి పూర్వ విద్యార్థులు

ఎమ్మిగనూరు టౌన్‌, జూన్‌ 9 : 42 ఏళ్ల కిందట విడిపోయిన పూర్వ విద్యార్థులు మళ్లీ కలుసుకోవడానికి స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వేదికయ్యింది. 1981-1982 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఒకచోటికి చేరి ఆనంద క్షణాలను ఆస్వాధించారు. ఈ బడిలో చదివిన పూర్వవిద్యార్థుల్లో యు.యు ప్రసాద్‌ ఏసీబీ జడ్జి, సోమశేఖర్‌ ఎం ఈ ఓ, బోడఈరన్న ఎం ఈ ఓ, వేంకటెశ్వర్లు డీఎం టెలికాం, శ్రీనివాసులు ఏఈ, ఇలియాస్‌ ఎస్‌బీఐ మేనేజర్‌ వివిధ హోదాలలో ఉన్నారు. వీరంతా ఆదివారం తమకు విద్యాబుద్దులు నేర్పిన చదువులమ్మ ఒడికి మళ్లీ చేరుకొని గత స్మృతులను తలచుకొని, ఒకరినోకరు అప్యాయంగా పలకరించుకొని వారి బాగోగులు తెలుసుకున్నారు. ఆ రోజుల్లో తరగతి గదుల్లో చేసిన అల్లరిని తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఉపాధ్యాయులు నర్సప్ప, సుజై ప్రేమ్‌కూమార్‌, వెంకటలక్ష్మి, అన్నపూర్ణమ్మ హాజరయ్యారు. అనంతరం ఉపాధ్యాయులకు పూలమాలలు వే సి బహుమతులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు గడిగె లింగప్ప విద్యావేత్త, లలిత్‌ జైన్‌, నాగేష్‌, వేంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 12:02 AM