Share News

ప్రారంభమైన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ABN , Publish Date - May 24 , 2024 | 11:11 PM

జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీ డియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పదో తరగతికి సంబంధించి 52 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

ప్రారంభమైన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

కడప(ఎర్రముక్కపల్లె), మే 24: జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీ డియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పదో తరగతికి సంబంధించి 52 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 16 కేంద్రాల్లో 1,098 మంది విద్యార్థులకు గాను 581 మంది (52 శాతం) హాజరయ్యారు. 517 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 8 కేంద్రాలను తనిఖీ చేయగా డీఈవో అనురాధ కడప నగరం జయనగర్‌కాలనీ జడ్పీ బాలికోన్నత పాఠశాలను పరిశీలించారు.

ఇక ఇంటర్మీడియట్‌కు సంబంధించి తొలిరోజు పరీక్షలకు 3,771 మందికి గాను 3,532 మంది విద్యార్థులు హాజరయ్యారు. 239 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలకు 3122 మందికి గాను 190 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 649 మందికి గాను 49 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలను ఆర్‌ఐవోతో పాటు ఫ్లయింగ్‌స్క్వాడ్‌ బృందాలు పరిశీలించాయి. ఆర్‌ఐవో వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయన్నారు.

Updated Date - May 24 , 2024 | 11:11 PM