AP News: ఏపీ భవన్ అధికారుల నిర్వాకం.. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని మర్చిపోయిన వైనం
ABN , Publish Date - Apr 05 , 2024 | 10:03 PM
దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారుల నిర్వాకం విస్మయం కలిగిస్తోంది. మహా రాజకీయ నేత, ఆదర్శప్రాయమైన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఏపీ భవన్ అధికారులు మరచిపోయారు. ఎలాంటి వేడుకలు జరపలేదు. మరోవైపు రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ ఢిల్లీలోనే ఉన్నప్పటికీ ఈ నిర్వాకానికి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహించకపోవడానికి సరైన కారణాన్ని అధికారులు చెప్పలేకపోతున్నారు.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారుల నిర్వాకం విస్మయం కలిగిస్తోంది. మహా రాజకీయ నేత, ఆదర్శప్రాయమైన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఏపీ భవన్ అధికారులు మరచిపోయారు. ఎలాంటి వేడుకలు జరపలేదు. మరోవైపు రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ ఢిల్లీలోనే ఉన్నప్పటికీ ఈ నిర్వాకానికి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహించకపోవడానికి సరైన కారణాన్ని అధికారులు చెప్పలేకపోతున్నారు. అయితే తెలంగాణ భవన్ అధికారులు మాత్రం ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ అధికారులను చూసైనా ఏపీ భవన్ అధికారులు మేల్కోనలేదు.
కాగా శుక్రవారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117 జయంతి దేశవ్యాప్తంగా ఘనంగా జరిగింది. అన్ని పార్టీల నేతలు, నాయకులు జగ్జీవన్ రామ్కు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆదర్శప్రాయమైన ఆయన జీవితాన్ని గుర్తుచేసుకున్నారు.