ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Mar 08 , 2024 | 03:47 AM
ళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును ఆ పదవి నుంచి తొలగించి, అతడిపై చర్యలు తీసుకోవాలని మైనారిటీ హక్కుల
లేకపోతే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం: ఫారూక్ సిబ్లీ
కర్నూలు, మార్చి 7: దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును ఆ పదవి నుంచి తొలగించి, అతడిపై చర్యలు తీసుకోవాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ సిబ్లీ డిమాండ్ చేశారు. గురువారం ఆయన కర్నూలు నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్లో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి, సమతా సైనిక్ దళ్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫారూఖ్ సిబ్లీ మాట్లాడుతూ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసును సీబీఐకి అప్పగించాలన్నారు. లేనిపక్షంలో తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు తదితరులు హాజరయ్యారు.