చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి: టీడీపీ
ABN , Publish Date - Apr 26 , 2024 | 04:10 AM
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై బెదిరింపులకు దిగిన ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆంధ్ర వర్సిటీ వీసీ ప్రసాద్రెడ్డిపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై బెదిరింపులకు దిగిన ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆంధ్ర వర్సిటీ వీసీ ప్రసాద్రెడ్డిపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ గడువును ఈ నెల 30 దాకా పొడిగించాలని కోరారు. గురువారం అమరావతి సచివాలయంలో అదనపు ఎన్నికల అధికారిని టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, పర్చూరి అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కోనేరు సురేశ్ కలసి, వినతి పత్రాలు అందజేశారు.