Share News

సోమిరెడ్డిపై హత్యాయత్నం దుర్మార్గం: అచ్చెన్న

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:10 AM

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై హత్యాయత్నం బాధాకరమని, వైసీపీ రౌడీల బరితెగింపునకు ఈ దాడి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు

సోమిరెడ్డిపై హత్యాయత్నం దుర్మార్గం: అచ్చెన్న

అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై హత్యాయత్నం బాధాకరమని, వైసీపీ రౌడీల బరితెగింపునకు ఈ దాడి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. సోమిరెడ్డిపై వైసీపీ నేత వెంకటయ్య, ఆయన అనుచరులు దాడి చేయడం దుర్మార్గమని ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీ సమావేశం వద్ద వైసీపీ నేతలు కర్రలు, రాడ్లతో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడులు చేసే వారిని, హత్యలు చేసే వారిని జగన్‌ ప్రోత్సహించడం వల్లనే వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. గతంలో సోమిరెడ్డిపై రకరకాల ఆరోపణలు చేసి, ఆ కేసుకు సంబంధించి ఫైల్స్‌ను కోర్టు నుంచి మాయం చేశారని, ఇప్పుడు ఏకంగా సోమిరెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారని, ఈ ఘటనకు స్థానిక మంత్రే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. దాడులు చేస్తాం, హత్యలు చేస్తామంటే టీడీపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, జగన్‌ ప్రోద్భలంతో వైసీపీ ముఠా చేసిన ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. ఇంకో 40 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడటం తధ్యమన్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన ఏ ఒక్కరినీ వదలకుండా చర్యలు తీసుకోవడం కూడా తధ్యమని తెలిపారు.

Updated Date - Feb 28 , 2024 | 03:10 AM