Share News

శాప్‌ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:28 AM

క్రీడా ప్రాధికార సంస్థ బోర్డు రద్దయింది. వైసీపీ ప్రభుత్వం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చైర్మన్‌గా 15 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైర్మన్‌, సభ్యులు అంతా రాజీనామా చేశారు

శాప్‌ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం

అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): క్రీడా ప్రాధికార సంస్థ బోర్డు రద్దయింది. వైసీపీ ప్రభుత్వం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చైర్మన్‌గా 15 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైర్మన్‌, సభ్యులు అంతా రాజీనామా చేశారు. ఆ రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో శాప్‌ బోర్డు మొత్తం రద్దయింది. ఈ మేరకు క్రీడాశాఖ కార్యదర్శి వి.వినయ్‌ చంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని శాప్‌ ఎండీని ఆదేశించారు.

Updated Date - Jul 26 , 2024 | 07:39 AM