పిఠాపురంలో రికార్డు స్థాయిలో 86.63ు పోలింగ్
ABN , Publish Date - May 15 , 2024 | 03:13 AM
కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 86.63 శాతం ఓట్లు కురిశాయి.
![పిఠాపురంలో రికార్డు స్థాయిలో 86.63ు పోలింగ్](https://media.andhrajyothy.com/media/2024/20240511/11_0b146d9c59.jpg)
పిఠాపురం, మే 14: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 86.63 శాతం ఓట్లు కురిశాయి. జనసేనాని పవన్ కల్యాణ్ ఇక్కడ పోటీచేసిన సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థిగా వంగా గీత బరిలో ఉన్నారు. ఇక్కడ గత ఎన్నికల్లో 81.1 శాతం పోలింగ్ నమోదైంది. ఈ దఫా ఐదున్నర శాతం ఎక్కువగా ఓట్లు పోలవడంతో ఇది ఎవరికి వరంగా మారుతుందోనన్న చర్చ జోరుగా సాగుతుంది. ఈ సారి నియోజకవర్గంలో అర్హులైన ఓటర్లు 2,36,409 మంది ఉండగా.. 2,04,811 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.