Share News

వందే భారత్‌ స్టాపింగ్‌ కోసం వినతి

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:04 AM

కల్బురిగి నుండి బెంగళూరు వరకు నడిచే వందేభారత్‌ రైలుకు ఆదోని స్టేషన్‌లో స్టాపింగ్‌ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య అన్నారు.

వందే భారత్‌ స్టాపింగ్‌ కోసం వినతి

ఆదోని టౌన్‌, మార్చి 27 : కల్బురిగి నుండి బెంగళూరు వరకు నడిచే వందేభారత్‌ రైలుకు ఆదోని స్టేషన్‌లో స్టాపింగ్‌ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, రెండు లక్షల పైచిలుకు జనాభా ఉన్న ఆదోని పట్టణ ప్రజలతో పాటు, డివిజన్‌లోని ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల ప్రజలు నిత్యం వివిధ అవసరాల నిమిత్తం ఆదోని స్టేషన్‌ నుండే బెంగుళూరుకు రాకపోకలను సాగిస్తుంటారని పేర్కొన్నారు. ఆదోని స్టేషన్‌లో స్టాపింగ్‌ ఏర్పాటు చేస్తే ఎంతో మంది ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని రైల్వే మంత్రికు లేఖ రాసినట్లు తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 12:04 AM