రేపు కూటమి ఎమ్మెల్యేల భేటీ
ABN , Publish Date - Jun 10 , 2024 | 03:47 AM
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం మంగళవారం జరగనున్నది.
![రేపు కూటమి ఎమ్మెల్యేల భేటీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక
అమరావతి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం మంగళవారం జరగనున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో లేదా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనుండటం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో కూటమి తరఫున శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. అనంతరం తీర్మానం ప్రతిని కూటమి ప్రతినిధి బృందం గవర్నర్ను కలిసి అందజేయనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. బుధవారం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎమ్మెల్యేల సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.