Share News

41ఏ నిబంధనలు పాటించండి

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:12 AM

తిరుమల శ్రీవారి ఆలయం, టీటీడీ అధికారుల ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో టీటీడీ గౌరవ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు విషయంలో సీఆర్పీసీ సెక్షన్‌ 41(ఏ)నిబంధనలు పాటించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

41ఏ నిబంధనలు పాటించండి

రమణ దీక్షితులు విషయంలో పోలీసులకు హైకోర్టు ఆదేశం

తిరుమల శ్రీవారి ఆలయం, టీటీడీ అధికారుల ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో టీటీడీ గౌరవ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు విషయంలో సీఆర్పీసీ సెక్షన్‌ 41(ఏ)నిబంధనలు పాటించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అర్నేశ్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేసింది. దర్యాప్తును కొనసాగించేందుకు పోలీసులకు వెసులుబాటు కల్పిస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులిచ్చారు.

Updated Date - Apr 26 , 2024 | 07:29 AM