28న ఓపీఎస్ పై రాజమండ్రిలో సభ: యూటీఎఫ్
ABN , Publish Date - Jan 21 , 2024 | 02:07 AM
పాత పెన్షన్ విధానం సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి ఈనెల 28న రాజమండ్రిలో విస్తృతస్థాయి సభ నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష,
![28న ఓపీఎస్ పై రాజమండ్రిలో సభ: యూటీఎఫ్](https://media.andhrajyothy.com/media/2023/20231205/utf_e2c3c02b36.jpg)
అమరావతి, విజయవాడ (గవర్నర్పేట)జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : పాత పెన్షన్ విధానం సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి ఈనెల 28న రాజమండ్రిలో విస్తృతస్థాయి సభ నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎ్స.ఎ్స.ప్రసాద్ తెలిపారు. శనివారం వారు విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఓపీఎస్ అమలు చేస్తామని ఎన్నికల ముందు మాట ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల తర్వాత అది సాధ్యం కాదని చేతులెత్తేశారరని మండిపడ్డారు. సీపీఎస్, జీపీఎ్సలు రెండూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టదాయకమేనని పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో పెట్టాలని వారు డిమాండ్ చేశారు.