24 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
ABN , Publish Date - May 21 , 2024 | 03:02 AM
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. జూన్ 3 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
![24 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు](https://media.andhrajyothy.com/media/2024/20240511/gg_8dfe536ceb.jpg)
అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. జూన్ 3 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షల ఏర్పాట్లకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లుచేసింది. దీనిపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ సోమవారం అన్ని జిల్లాల డీఈవోలు, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డితో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 96, 938 మంది అబ్బాయిలు, 64,939 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ పరీక్షలకు 685 సెంటర్లు ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రాల మార్గాల్లో సరిపడా బస్సులు నడిపేలా చూ స్తున్నామని, సెంటర్లలో వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని కమిషనర్ తెలిపారు.