Share News

ఆర్టీసీ కార్గోలో రూ.22లక్షల నగదు

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:19 AM

ఏపీఎస్‌ ఆర్టీసీ కార్గో వాహనంలో అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు కలకలం రేపాయి.

ఆర్టీసీ కార్గోలో రూ.22లక్షల నగదు

అట్టపెట్టెల్లో తరలిస్తుండగా.. సీజ్‌

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్‌ 7: ఏపీఎస్‌ ఆర్టీసీ కార్గో వాహనంలో అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు కలకలం రేపాయి. హైదరాబాద్‌ నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న ఏపీఎస్‌ ఆర్టీసీకి చెందిన కార్గో వాహనంలో నగదు తరలిస్తున్నట్టు పోలీసులకు ముందుగానే సమాచారం అందింది. ఆదివారం ఉదయం 9 గంటలకు జంగారెడ్డిగూడెం గంగానమ్మ గుడి సెంటర్‌ సమీపంలో ఆ వాహనాన్ని డీఎస్పీ రవిచంద్ర, సీఐ రాజేష్‌, తహసీల్దార్‌ స్లీవజోజి ఆపి పార్శిళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని అట్టపెట్టెల్లో బిల్లులు లేని మొత్తం రూ.22,59,500ను గుర్తించి సీజ్‌ చేసి ట్రెజరీకి తరలించారు.

Updated Date - Apr 08 , 2024 | 04:19 AM