Share News

20 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:12 AM

మండలంలోని లింగదహాళ్‌, రంగాపురం క్యాంపు గ్రామాల్లోని వైసీపీకి చెందిన 20 కుటుంబాలు శనివారం టీడీపీలోకి చేరాయి.

20 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరిక
కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానిస్తున్న కాలవ శ్రీనివాసులు

బొమ్మనహాళ్‌, జనవరి20: మండలంలోని లింగదహాళ్‌, రంగాపురం క్యాంపు గ్రామాల్లోని వైసీపీకి చెందిన 20 కుటుంబాలు శనివారం టీడీపీలోకి చేరాయి. టీడీపీ మాజీ కన్వీనర్‌ చలపతి, దివాకర్‌, రామాంజనేయులు, గో పాల్‌ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 20 కుటుంబాలు పొలిట్‌ బ్యూరో సభ్యు డు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు సమక్షంలో టీడీపీ కండువా వేసుకున్నారు. రాయదుర్గం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో రామాంజనేయులు, ఓబుళేశు, మల్లప్ప, లోకేష్‌, ప్రసాద్‌, నాగేంద్ర, వీరన్న, పైనేటి శరతబాబు, పైనేటీ నారాయణ టీడీపీలోకి చేరారు. జగన పాలనలో ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్ని సామాజిక వర్గాల వారు అభివృద్ధి చెం దుతారని వారన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 12:12 AM