వైసీపీ నేత బార్లో 1.3 కోట్ల మద్యం సీజ్
ABN , Publish Date - Apr 26 , 2024 | 04:24 AM
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నాయకుల మద్యం డంపుల పుట్ట పగులుతోంది. రెండ్రోజుల క్రితం ముత్తుకూరు, పొదలకూరు మండలాల్లో భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్, ఎక్సైజ్ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున అల్లూరులోని ఓ బార్పై దాడులు నిర్వహించి రూ.1.3 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు.
నెల్లూరు జిల్లా అల్లూరులో గుర్తింపు
అల్లూరు, ఏప్రిల్ 25 : నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నాయకుల మద్యం డంపుల పుట్ట పగులుతోంది. రెండ్రోజుల క్రితం ముత్తుకూరు, పొదలకూరు మండలాల్లో భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్, ఎక్సైజ్ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున అల్లూరులోని ఓ బార్పై దాడులు నిర్వహించి రూ.1.3 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. ఈ బార్ అధికార పార్టీకి చెందిన నాయకుడిది కావడంతో కలకలం రేగుతోంది. ముందుగా బుధవారం రాత్రి ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో ఈ బారుకు సమీపంలో 272 మద్యం సీసాలను పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న ఇస్కపల్లికి చెందిన కొండూరు శ్రీనివాసులు, యల్లంగారి పార్వతయ్యలను అదుపులోకి తీసుకొని విచారించగా ‘లవీ డవీ’ బార్ నుంచి వాటిని తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందానికి సమాచారం అందించడంతో ఎక్సైజ్ సూపరిండెంట్ నాగమల్లీశ్వర్రెడ్డి, సెబ్ సూపరిండెంట్ బాబు శ్రీధర్ తమ సిబ్బందితో గురువారం వేకువజామున ఆ బార్పై దాడులు చేశారు. దాదాపు ఐదు గంటలపాటు సోదాలు నిర్వహించి, రూ1.3 కోట్లు విలువ చేసే 78 వేల పైచిలుకు మద్యం సీసాలు, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.