ఆలూరు అసెంబ్లీ ఎన్నికల బరిలో 12 మంది అభ్యర్థులు
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:19 AM
ఆలూరు అసెంబ్లీ స్థానానికి మొత్తం 25 నామినేషన్లు రాగా, 15 మంది నామినేషన్లు మాత్రమే మిగిలాయి. అందులో రెండు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
![ఆలూరు అసెంబ్లీ ఎన్నికల బరిలో 12 మంది అభ్యర్థులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆలూరు, ఏప్రిల్ 29: ఆలూరు అసెంబ్లీ స్థానానికి మొత్తం 25 నామినేషన్లు రాగా, 15 మంది నామినేషన్లు మాత్రమే మిగిలాయి. అందులో రెండు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. రెండు రోజుల పాటు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సాగింది. సోమవారం 13 మందిలో స్వతంత్ర అభ్యర్థి బుడగ జంగాల లక్ష్మన్న తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో మొత్తం 12 మంది బరిలో ఉన్నట్లు ఆలూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాము నాయక్ తెలిపారు.