కొంపెల్లిలో యువతి అదృశ్యం
ABN , First Publish Date - 2023-03-26T00:16:57+05:30 IST
మండలంలోని కొంపెల్లి గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు ఎస్ఐ బాబు శుక్రవారం తెలిపారు.
కొంపెల్లిలో యువతి అదృశ్యం
తిరుమలగిరి(సాగర్), మార్చి 25: మండలంలోని కొంపెల్లి గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు ఎస్ఐ బాబు శుక్రవారం తెలిపారు. కొంపెల్లి గ్రామానికి చెం దిన 24ఏళ్ల అవివాహిత బిజిలి మహేశ్వరి వృత్తి రీత్యా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్టోర్లో పనిచేస్తుంది. ఆమె హైదరాబాద్ నుంచి 15రోజుల క్రితం గ్రామానికి చేరుకుం ది. ఇంటికి వచ్చిన మహేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు గ్రామంతో పాటు వారి బంధువుల ఇళ్లల్లో వెతకగా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తండ్రి సాయిలు పోలీ్సస్టేషనలో ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.