నేడు రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు బంద్
ABN , First Publish Date - 2023-12-03T03:28:30+05:30 IST
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులను మూసివేయనున్నారు. వైన్ షాపులు, బార్లు, మద్యం సర్వ్ చేసే క్లబ్బులు, రిసార్డులన్నింటినీ రోజంతా మూసి ఉంచాలని ఎక్సైజ్ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, డిసెంబరు2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులను మూసివేయనున్నారు. వైన్ షాపులు, బార్లు, మద్యం సర్వ్ చేసే క్లబ్బులు, రిసార్డులన్నింటినీ రోజంతా మూసి ఉంచాలని ఎక్సైజ్ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడా మద్యం విక్రయాలు జరగకుండా నిఘా పెట్టాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు.