రోడ్డుపై వరి నాట్లతో గ్రామస్తుల నిరసన

ABN , First Publish Date - 2023-07-21T03:36:49+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని సల్కాపురం గ్రామంలో ప్రధాన రహదారి బురదగుంటగా మారి,

రోడ్డుపై వరి నాట్లతో గ్రామస్తుల నిరసన

గట్టు, జూలై 20 : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని సల్కాపురం గ్రామంలో ప్రధాన రహదారి బురదగుంటగా మారి, ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గురువారం గ్రామస్థులు రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. మూడు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలకు రోడ్డంతా బురదమయంగా మారి నడవడానికి వీలులేకుండా తయారైందని, రోడ్డు బాగు చేయాలని గ్రామ సర్పంచ్‌, అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్థులు ఆరోపించారు. ప్రతీ సంవత్సరం వర్షాకాలం వచ్చిందటే బురదమయంగా మారిన రోడ్డుపైనే వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్డు బాగుచేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-07-21T03:36:49+05:30 IST