Share News

వీరేశానికి చెర్వుగట్టు అర్చకుల వేదాశీర్వచనం

ABN , First Publish Date - 2023-12-12T00:03:40+05:30 IST

నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశానికి మండలంలోని చెర్వుగట్టు పార్వ తీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం అర్చకు లు సోమవారం వేదాశీర్వచనం చేశారు.

  వీరేశానికి చెర్వుగట్టు అర్చకుల వేదాశీర్వచనం
ఎమ్మెల్యే వీరేశాన్ని ఆశీర్వదిస్తున్న చెర్వుగట్టు అర్చకులు

వీరేశానికి చెర్వుగట్టు అర్చకుల వేదాశీర్వచనం

నార్కట్‌పల్లి, డిసెంబ రు 11: నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశానికి మండలంలోని చెర్వుగట్టు పార్వ తీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం అర్చకు లు సోమవారం వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈవో సిరికొండ నవీనకుమార్‌ సిబ్బందితో పాటు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వీరేశాన్ని నకిరేకల్‌లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకం గా కలిశారు. ఎమ్మెల్యేను ఈవో నవీన దుశ్శాలువాతో సత్కరించగా ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, సురేశశర్మ ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో క్షేత్రాన్ని సందర్శించి దేవస్థాన అభివృద్ధికి చేపట్టాల్సిన విషయాలపై చర్చిద్దామని చెప్పారు. కార్యక్రమంలో చెర్వుగట్టు మాజీ సర్పంచ నేతకాని కృష్ణయ్య, నాయకులు పున్నంరాజు యాదగిరి, గడుసు శశిధర్‌రెడ్డి, వారా ల రమేష్‌, నవీనరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, నర్సిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-12-12T00:03:42+05:30 IST