ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం రేపటితో పూర్తి
ABN , First Publish Date - 2023-05-26T04:03:55+05:30 IST
గవర్నర్ కోటా కింద ఎంపికైన ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల 27న (శనివారం) ముగియనుంది. ఈ స్థానాల్లో

● గులాబీ బాస్ నిర్ణయంపై ఆశావహుల్లో ఉత్కంఠ
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): గవర్నర్ కోటా కింద ఎంపికైన ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల 27న (శనివారం) ముగియనుంది. ఈ స్థానాల్లో ఎవరిని భర్తీ చేస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్ మదిలో ఎవరున్నారు? ఎమ్మెల్సీలుగా ఎవరిని నిర్ణయిస్తారన్నదానిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలైన రాజేశ్వర్రావు, ఫారుఖ్ హుస్సేన్ పదవీ కాలం ముగియనుండటంతో వారి స్థానంలో కొత్త వారిని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చించి ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ గురువారం నాటికీ బీఆర్ఎస్ ప్రకటన వెలువడలేదు. దీంతో గులాబీ బాస్ఎవరిని ఎమ్మెల్సీలుగా నిర్ణయిస్తారోనని ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎంపికకు బిక్షమయ్యగౌడ్, ఘంటా చక్రపాణి, పీఎల్ శ్రీనివాస్, బండి రమేశ్, దాసోజుశ్రవణ్, విద్యార్థి నాయకుడు తుంగబాలు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.