అధికారుల గైర్హాజర్‌పై మండల సభ ఆగ్రహం

ABN , First Publish Date - 2023-03-04T01:02:47+05:30 IST

మండల సర్వస భ్య సమావేశానికి సగం మంది అధికారులు హాజరుకాకపోవడంపై మండ ల సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం మం డల సర్వసభ్య సమావే శం ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది.

 అధికారుల గైర్హాజర్‌పై మండల సభ ఆగ్రహం
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ వెంకటేశ్వర్లు

అధికారుల గైర్హాజర్‌పై మండల సభ ఆగ్రహం

గుర్రంపోడు, మా ర్చి 3: మండల సర్వస భ్య సమావేశానికి సగం మంది అధికారులు హాజరుకాకపోవడంపై మండ ల సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం మం డల సర్వసభ్య సమావే శం ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. మండల సర్వసభ్య సమావేశాలకు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు ఉన్నా సగం శాఖల అధికారులు హాజరుకాకపోతే ఆయా శా ఖలపై చర్చ ఎలా జరుగుతుందని ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ ఆ దేశాల మేరకు హాజరుకాని అధికారులపై చర్యకు కలెక్టర్‌కు నివేదిక పంపాలని ఆదేశాల మేరకు తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ఎంపీడీవో సుధాకర్‌ తెలిపారు. ఏ ఎమ్మార్పీ ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేతతో పొలాలు ఎండుతున్నాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మోటార్ల మరమ్మతులు పూర్తయ్యాయని శు క్రవారం మంచి నీరు ఆయకట్టుకు అందుతుందని సంబంధిత అధికారి తెలిపా రు. వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా మిషన భగీరథ అధికారులు అ ప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ సూచించారు. సమావేశంలో తహసీల్దార్‌ హుస్సేన, ఎంఈవో తరి రాము, ఏవో కంచర్ల మాధవరెడ్డి, పశువైద్యాధికారి అశోక్‌కుమార్‌, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారి సరళ, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-04T01:02:47+05:30 IST