డిస్కమ్‌ల నష్టాల ప్రభావం సింగరేణిపై!

ABN , First Publish Date - 2023-06-02T02:32:35+05:30 IST

డిస్కమ్‌ల ఆర్థిక నష్టాల ప్రభావం సింగరేణిపైనా పడుతోంది. 1,200 మెగావాట్ల థర్మల్‌ ప్లాంటుతో పాటు 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును సింగరేణి సంస్థ డిస్కమ్‌లకు అమ్ముతోంది.

డిస్కమ్‌ల నష్టాల ప్రభావం సింగరేణిపై!

బకాయిలు 18వేల కోట్లు.. టీఎస్‌ జెన్‌కో 2953 కోట్లు

సింగరేణి ఫిబ్రవరి నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): డిస్కమ్‌ల ఆర్థిక నష్టాల ప్రభావం సింగరేణిపైనా పడుతోంది. 1,200 మెగావాట్ల థర్మల్‌ ప్లాంటుతో పాటు 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును సింగరేణి సంస్థ డిస్కమ్‌లకు అమ్ముతోంది. గత ఫిబ్రవరిలో సింగరేణి నివేదిక ప్రకారం.. డిస్కమ్‌లు సింగరేణికి రూ.18,004 కోట్లు బకాయి పడ్డాయి. ఇందులో రూ.5,899 కోట్లు ఆలస్య రుసుమే. అంతే కాకుండా, దేశవ్యాప్తంగా వివిధ జెన్‌కోలకు కూడా సింగరేణి బొగ్గును సరఫరా చేస్తోంది. ఈ బొగ్గు బకాయిల్లో తెలంగాణ జెన్‌కో వాటా రూ.2,953 కోట్లుగా ఉంది. డిస్కమ్‌లు, జెన్‌కోల నుంచి చెల్లింపులు ఆగిపోవడంతో సింగరేణిలో కార్మికుల వేతనాలకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది.

Updated Date - 2023-06-02T02:32:35+05:30 IST