‘ఆరోగ్య మహిళ’ ప్రారంభం
ABN , First Publish Date - 2023-03-15T04:19:05+05:30 IST
ఆరోగ్య మహిళ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. మొదటి రోజు 4793 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించారు.
హైదరాబాద్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య మహిళ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. మొదటి రోజు 4793 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించారు. 975 మందికి అవసరమైన ఔషధాలు అందజేశారు. మొదటి దశలో 24 జిల్లాల్లో 100 కేంద్రాల్లో వైద్య సేవలు మొదలయ్యాయి. దశల వారీగా 1200 కేంద్రాలకు విస్తరించనున్నారు. ఈ కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళలకు వైద్య సేవలందిస్తారు.