CM KCR: ముకర్రమ్ ఝా మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
ABN , First Publish Date - 2023-01-15T17:37:25+05:30 IST
సంస్థానం ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనువడు ముకర్రమ్ ఝా మృతికి సీఎం కేసీఆర్ (CM KCR) సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: సంస్థానం ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనువడు ముకర్రమ్ ఝా మృతికి సీఎం కేసీఆర్ (CM KCR) సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. విద్య, వైద్య రంగాల్లో పేదల కోసం సామాజిక సేవ చేశారని సీఎం కొనియాడారు. అధికారిక లాంఛనాలతో ముకర్రమ్ ఝా అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్ శాంతికుమారికి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.