మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:42 AM
విద్యుత్తుసంస్థల్లో ఎనిమిదేళ్లు ఉన్నతస్థానాల్లో పనిచేసిన 166 మంది ఇంజనీర్లు ఏ తప్పు చేయకున్నా రివర్షన్ ఇచ్చి మనోవేదనకు గురిచేస్తున్నారని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్ కోదండరాంకు రివర్షన్ పొందిన ఇంజనీర్ల వినతి
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తుసంస్థల్లో ఎనిమిదేళ్లు ఉన్నతస్థానాల్లో పనిచేసిన 166 మంది ఇంజనీర్లు ఏ తప్పు చేయకున్నా రివర్షన్ ఇచ్చి మనోవేదనకు గురిచేస్తున్నారని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పదోన్నతుల నుంచి రివర్షన్ పొందిన ఇంజనీర్ల సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషిచేయాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు ఆదివారం టీఎ్సజెన్కో, ట్రాన్స్కో రివర్టెడ్ ఇంజనీర్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇంజనీర్లు డి.బాలాజీ, సురేష్ బాబు, పవన్కుమార్ మాట్లాడుతూ చేయని తప్పునకు పదోన్నతుల నుంచి వెనక్కి పంపి తాము మనోవేదనకు గురయ్యేందుకు యాజమాన్యం కార ణమైందన్నారు. రివర్షన్ పొందిన ఇంజనీర్లకు న్యాయం జరిగేలా చూస్తానని కోదండరాం హామీ ఇచ్చినట్లు తెలిపారు.