జావేద్ అక్తర్కు సినారె అవార్డు ప్రదానం
ABN , First Publish Date - 2023-07-30T03:16:22+05:30 IST
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, సమాజం మరింత మానవీయం చెందేందుకు కవిత్వం ప్రధాన ప్రేరకంగా నిలుస్తుందని ప్రఖ్యాత కవి, హిందీ సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ అన్నారు.
హైదరాబాద్ సిటీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, సమాజం మరింత మానవీయం చెందేందుకు కవిత్వం ప్రధాన ప్రేరకంగా నిలుస్తుందని ప్రఖ్యాత కవి, హిందీ సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ అన్నారు. శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతి వేదికగా జావేద్ అక్తర్కు విశ్వంభర-సినారె జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శాలువా, జ్ఞాపికతో పాటు రూ.ఐదు లక్షల నగదు పురస్కారాన్ని సినారె కుటుంబసభ్యులు అందజేశారు. అనంతరం జావేద్ అక్తర్ మాట్లాడుతూ భిన్న భాషలు, విభిన్న సంస్కృతులు ఉన్న ఈ దేశంలో ఒక ప్రాంత సాహిత్యాన్ని మరో ప్రాంతీయులు తెలుసుకోడానికి అనువాదాలు గవాక్షంలా పనిచేస్తాయని అన్నారు. ప్రముఖ రచయిత, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ దీపక్ మహాన్ మాట్లాడుతూ వ్యక్తిగత జీవితానికే పరిమితం కావాల్సిన మతాన్ని ఓ సంక్లిష్ట సమస్యగా మార్చి జన బాహుళ్యం ముందు పెట్టడాన్ని పౌర సమాజం నిరసించాలని కోరారు.