Barrelakka : శిరీష (బర్రెలక్క)కు రూ.5.20లక్షల సాయం
ABN , First Publish Date - 2023-11-28T04:23:35+05:30 IST
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న శిరీష (బర్రెలక్క)కు సోమవారం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ..
అందించిన పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి
యానాం, నవంబరు 27: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న శిరీష (బర్రెలక్క)కు సోమవారం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు రూ.5.20లక్షలు అందజేశారు. ఇప్పటికే ఎన్నికల ఖర్చు కోసం రూ.లక్ష అందించిన ఆయన సోమవారం తన అనుచరులతో కలిసి కొల్లాపూర్ వెళ్లి మిత్రులు, యానాం ప్రజలు ఇచ్చిన మరో రూ.5.20లక్షల డీడీని ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా మల్లాడి మాట్లాడుతూ తండ్రి సహకారం లేకుండా బర్రెలను కాస్తూ డిగ్రీ పూర్తిచేసిన శిరీష, బీఈడీ చదువుతూ ఎన్నికల్లో పోటీచేయడం అభినందనీయమని అన్నారు. ఆమె యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు. పేద కుటుంబం నుంచి వచ్చిన శిరీష (బర్రెలక్క)కు కొల్లాపూర్ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని మల్లాడి విజ్ఞప్తి చేశారు.