రేవంత్‌.. బీజేపీ కోవర్ట్‌

ABN , First Publish Date - 2023-06-26T03:00:02+05:30 IST

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బీజేపీకి కోవర్టుగా మారారని.. కాంగ్రె్‌సను ముంచే ప్రయత్నంలో బిజీగా ఉన్నారని బీఆర్‌ఎస్‌ నేతలు దానం నాగేందర్‌, దాసోజు శ్రవణ్‌, శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు.

రేవంత్‌.. బీజేపీ కోవర్ట్‌

బీఆర్‌ఎస్‌ నేతల మండిపాటు

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బీజేపీకి కోవర్టుగా మారారని.. కాంగ్రె్‌సను ముంచే ప్రయత్నంలో బిజీగా ఉన్నారని బీఆర్‌ఎస్‌ నేతలు దానం నాగేందర్‌, దాసోజు శ్రవణ్‌, శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. ఆదివారం రాత్రి తెలంగాణ భవన్‌లో మీడియాతో వారు మాట్లాడు తూ.. తెలంగాణ అభివృద్ధి కోసం, రాష్ర్టానికి రావాల్సిన నిధులివ్వాలని మంత్రి కేటీఆర్‌ కేంద్రమంత్రులను కలిస్తే.. కేసుల కోసం వెళ్లారంటూ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. అసలు రాజకీయాలు, వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయో రేవంత్‌కి అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. గతంలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి కేంద్రమంత్రులను ఆయనెందుకు కలిశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-06-26T03:00:02+05:30 IST