జీవోనెం.112ను రద్దు చేయాలి:ఏఈఈలు
ABN , First Publish Date - 2023-03-26T02:30:58+05:30 IST
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పదోన్నతులకు ప్రతిబంధకంగా మారిన జీవో నెంబరు 112ను రద్దుచేయాలని తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పదోన్నతులకు ప్రతిబంధకంగా మారిన జీవో నెంబరు 112ను రద్దుచేయాలని తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం జలసౌధ ముందు ఇంజనీర్లు ధర్నా చేశారు. బీటెక్ చేసి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఏఈఈ)లుగా నియమితులై 15 ఏళ్లు అవుతున్నా పదోన్నతులు కల్పించడం లేదని, అదే డిప్లొమా ఇంజనీర్లకు 11 ఏళ్లకే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(డీఈఈ)లుగా పదోన్నతులు ఇవ్వడానికి వీలుగా జీవోనెం.112ను తెచ్చారని ఇంజనీర్లు మండిపడ్డారు. తక్షణమే జీవోనెం.112ను రద్దుచేయాలని వారు డిమాండ్ చేశారు.