బీసీ గురుకుల ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

ABN , First Publish Date - 2023-05-30T03:59:18+05:30 IST

బీసీ గురుకుల ఇంటర్మీడియట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సోమవారం విడుదల

బీసీ గురుకుల ఇంటర్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): బీసీ గురుకుల ఇంటర్మీడియట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సోమవారం విడుదల చేశారు. సోమవారం విడుదలైన ఫలితాలలో సిద్ధిపేట జిల్లాకు చెందిన పి.జ్యోత్స్న ఎంపీసీలో 150 మార్కులకు గాను 122 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారు. బైపీసీలో 108 మార్కులతో నల్లగొండ జిల్లాకు చెందిన పి.శ్రీవల్లి, సీఈసీలో 107 మార్కులతో పెద్దపల్లి జిల్లాకు చెందిన సాయి సంహిత, ఎంఈసీలో 109 మార్కులతో మేడ్చల్‌ జిల్లాకు చెందిన ఎ.అర్చనలు కూడా మొదటి స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. కాగా, పరీక్ష ఫలితాలను సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, ఉత్తీర్ణులైన విద్యారులు జూన్‌ 1 నుంచి 10వ తేదీలోపు కళాశాలల్లో చేరాలని గురుకుల కార్యదర్శి మల్లయ్య భట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2023-05-30T03:59:18+05:30 IST