Share News

అదనపు బ్యాలెట్‌ యూనిట్ల ర్యాండమైజేషన్‌ పూర్తి

ABN , First Publish Date - 2023-11-22T00:02:17+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొదటి విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ, అదనపు బ్యాలెట్‌ యూనిట్ల పరిశీలన పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌పోట్రు తెలిపారు.

అదనపు బ్యాలెట్‌ యూనిట్ల ర్యాండమైజేషన్‌ పూర్తి
వీవీ ప్యాట్లను పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్‌

జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్‌ పోట్రు

మేడ్చల్‌ నవంబరు 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొదటి విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ, అదనపు బ్యాలెట్‌ యూనిట్ల పరిశీలన పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌పోట్రు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి, డీఆర్‌ఓ హరిప్రియలతో పాటు జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతిధులతో కలిసి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజిగిరి, ఉప్పల్‌ నియోజకవర్గాలకు అదనంగా బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌యూనిట్లు అవసరం కాగా అందులో మల్కాజిగిరి నియోజకవర్గానికి బ్యాలెట్‌ యూనిట్లు 1,096, కంట్రోల్‌ యూనిట్లు 23చొప్పున, ఉప్పల్‌ నియోజకవర్గానికి బ్యాలెట్‌ యూనిట్లు 1060, కంట్రోల్‌ యూనిట్లు 15 కేటాయించినట్లు వివరించారు. అనంతరం కలెక్టరేట్‌లో అదనపు బ్యాలెట్‌ యూనిట్లు, వీవీ ప్యాట్లను జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్‌ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు.

Updated Date - 2023-11-22T00:02:19+05:30 IST