అభివృద్ధిని పట్టించుకోని గత ప్రభుత్వాలు : భగత
ABN , First Publish Date - 2023-09-22T00:16:56+05:30 IST
అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేద ని, మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఎమ్మెల్యే నోము ల భగత అన్నారు.
అభివృద్ధిని పట్టించుకోని గత ప్రభుత్వాలు : భగత
నిడమనూరు, సెప్టెంబరు 21: అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేద ని, మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఎమ్మెల్యే నోము ల భగత అన్నారు. గురువా రం ఆయన నిడమనూరు లో పర్యటించారు. ద్విచక్రవాహనంపై తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మినీ ట్యాంక్బండ్ పనులను పరిశీలించారు. అధికారులు, ప్ర జాప్రతినిధులతో కలిసి ఓపెన జిమ్, మినీ స్టేడియం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిడమనూరు మండలం వెనుకబాటుకు జానారెడ్డే కారణమన్నారు. నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చే సేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్, నాయకులు రవి, రామలింగయ్య, స లీం, వెంకటరమణ, నారాయణ, దాసు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.