కుమార్తెను కాపాడుకునేందుకు బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం:ప్రవీణ్కుమార్
ABN , First Publish Date - 2023-05-26T03:05:14+05:30 IST
క్రిప్టో కరెన్సీ, హవాలా ద్వారా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రూ.80 కోట్లు చెల్లించినట్లు మనీలాండరింగ్ కేసులో

క్రిప్టో కరెన్సీ, హవాలా ద్వారా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రూ.80 కోట్లు చెల్లించినట్లు మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుఖేశ్ చంద్రశేఖర్ ఇచ్చిన వాంగ్మూలంతో పాటు ఈడీ వద్ద అన్ని ఆధారాలు ఉన్నా కూడా కవితను అరెస్టు చేయడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ‘రూ.80 కోట్ల బదిలీ’ పేరుతో గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేస్తూ ట్విటర్లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమార్తె కవితను కాపాడుకోవడం కోసం బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందుకే రాష్ట్రంలోని లేని బీజేపీని ప్రత్యమ్నాయ ప్రతిపక్షంగా ప్రజలకు కేసీఆర్ చూపుతున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న దొంగ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.