Share News

బండారు దత్తాత్రేయ మనవరాలికి ప్రధాని మోదీ అభినందనలు

ABN , First Publish Date - 2023-12-11T04:02:58+05:30 IST

తనపై పద్య గానం చేసిన హరియాణా రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మనవరాలు జశోధర(5)ను ప్రధాని మోదీ అభినందించారు. ‘ఆమె మాటలు గొప్ప శక్తికి మూలం’ అని ఆయన ఎక్స్‌(ట్విటర్‌)లో పేర్కొన్నారు.

బండారు దత్తాత్రేయ మనవరాలికి ప్రధాని మోదీ అభినందనలు

రాంనగర్‌, హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తనపై పద్య గానం చేసిన హరియాణా రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మనవరాలు జశోధర(5)ను ప్రధాని మోదీ అభినందించారు. ‘ఆమె మాటలు గొప్ప శక్తికి మూలం’ అని ఆయన ఎక్స్‌(ట్విటర్‌)లో పేర్కొన్నారు. జశోధర ఈనెల 8న రాంనగర్‌లోని తమ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానిని ప్రశంసిస్తూ హిందీలో పద్యం పాడింది. ఆ వీడియోను దత్తాత్రేయ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. చిన్నారి పద్యగానానికి ముగ్థులయిన ప్రధాని ‘‘సృజనాత్మకం. ఆరాధనీయం. ఆమె మాటలు గొప్ప శక్తికి మూలం’’ అని రాస్తూ ఆ పోస్ట్‌ను రీట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-12-11T04:02:59+05:30 IST