ప్రజలు అధికారం ఇచ్చింది విద్వేషాలు పెంచేందుకా?

ABN , First Publish Date - 2023-08-09T04:26:09+05:30 IST

‘‘ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది.. దేశంలో అల్లర్లు కావాలనా? విద్వేషాలు పెంచాలనా?’’ అని బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి బీజేపీని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చేయూతనిస్తూ..

ప్రజలు అధికారం ఇచ్చింది విద్వేషాలు పెంచేందుకా?

మణిపూర్‌పై ప్రధాని సమాధానం చెప్పాలి: ఎంపీ రంజిత్‌ రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది.. దేశంలో అల్లర్లు కావాలనా? విద్వేషాలు పెంచాలనా?’’ అని బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి బీజేపీని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చేయూతనిస్తూ.. లేనిచోట అధికారానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు ఎదుట ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం సంపాదించిన డబ్బులు తీసుకుని.. కావలసిన వాళ్లకు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు మంచి మెజారిటీ, అవకాశం ఇచ్చారని చెబుతున్న బీజేపీ.. దేశంలో ఏం జరుగుతోందనేదానిపై సమాధానం చెప్పాలని అవిశ్వాసంపై చర్చలో నిలదీస్తామన్నారు. మణిపూర్‌ దారుణాలపై ప్రధాని సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-08-09T04:26:09+05:30 IST