ఎంటెక్‌, ఎం ఫార్మసి ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2023-09-22T03:27:21+05:30 IST

స్పాన్సర్డ్‌ కేటగిరీలో ఎంటెక్‌, ఎం ఫార్మసి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జేఎన్‌టీయూ హైదరాబాద్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఎంటెక్‌, ఎం ఫార్మసి  ప్రవేశాలకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): స్పాన్సర్డ్‌ కేటగిరీలో ఎంటెక్‌, ఎం ఫార్మసి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జేఎన్‌టీయూ హైదరాబాద్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్‌ అక్టోబరు 4, 5, 6 తేదీల్లో జరగనుంది. అర్హులైన అభ్యర్థులు వర్సిటీలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలి. కోర్సులు, అర్హత, ఫీజులు ఇతర వివరాలకు జేఎన్‌టీయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ సూచించారు. స్పాన్సర్డ్‌ కేటగిరీలో సీటు పొందిన వారికి స్కాలర్‌షిప్‌, హాస్టల్‌ సదుపాయాలు ఉండవని పేర్కొన్నారు.

Updated Date - 2023-09-22T03:27:21+05:30 IST