కారు బోల్తాపడి నవవరుడి మృతి

ABN , First Publish Date - 2023-06-11T03:03:24+05:30 IST

పెళై నెల రోజులైనా కాకముందే కారు బోల్తాపడి నవవరుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ బైపాస్‌పై శనివారం మధ్యాహ్నం జరిగింది. సిద్దిపేట అర్బన్‌ మండలం

కారు బోల్తాపడి నవవరుడి మృతి

తల్లిదండ్రులకు, భార్యకు తీవ్రగాయాలు

కారు టైర్‌ పేలడంతో దుర్ఘటన

గజ్వేల్‌, జూన్‌ 10: పెళై నెల రోజులైనా కాకముందే కారు బోల్తాపడి నవవరుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ బైపాస్‌పై శనివారం మధ్యాహ్నం జరిగింది. సిద్దిపేట అర్బన్‌ మండలం బక్రిచెప్యాలకు చెందిన పురుమాండ్ల ప్రభాకర్‌రెడ్డి కుమారుడు నిఖిల్‌రెడ్డి (30) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నారు. గత నెల 14న నిఖిల్‌రెడ్డి వివాహం అయింది. ఆయన హైదరాబాద్‌లో నూతనంగా తీసుకున్న ఫ్లాట్‌లో పూజ చేసేందుకు భార్య వాణి, తండ్రి ప్రభాకర్‌రెడ్డి, తల్లి సుకృతతో కలసి సిద్దిపేట నుంచి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో ప్రజ్ఞాపూర్‌ బైపాస్‌పై ప్రమాదవశాత్తు కారు టైర్‌ పేలడంతో అదుపుతప్పి కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నిఖిల్‌ తలకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను గజ్వేల్‌ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిఖిల్‌రెడ్డి మృతిచెందారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2023-06-11T03:03:24+05:30 IST