మునుగోడు అభివృద్ధే లక్ష్యం : ప్రభాకర్రెడ్డి
ABN , First Publish Date - 2023-09-22T00:19:19+05:30 IST
మునుగోడు ని యోజకవర్గ అభివృద్ధే త న లక్ష్యమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రె డ్డి అన్నారు.
మునుగోడు అభివృద్ధే లక్ష్యం : ప్రభాకర్రెడ్డి
మర్రిగూడ, మును గోడు రూరల్, సెప్టెంబరు 21: మునుగోడు ని యోజకవర్గ అభివృద్ధే త న లక్ష్యమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రె డ్డి అన్నారు. గురువారం మర్రిగడూడ మండలంలోని ఖుదాభక్ష్పల్లి గ్రా మ పంచాయతీ పరిధిలో ని సాయిబండాతండాకు వెళ్లే రోడ్డులో కల్వర్టు నిర్మాణం, సర్పంపేట నుంచి భీమనపల్లికి వెళ్లే బీటీరోడ్డు మరమ్మతులు, రాజ్పేటతండా నూతన గ్రామపంచాయ తీ భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా మునుగో డు మండలంలోని పలివెల గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో సీసీరోడ్డు, రూ. 1.70 కోట్లతో కచలాపురం నుంచి కిష్టాపురం వరకు బీటీ రోడ్డు రెన్యువల్, జక్కలవారిగూడెం గ్రామపంచాయతీలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీకి శంకుస్థాపనతో పాటు అదే గ్రామంలో ప్రాథమిక పాఠశాల తరగతి గదులను ప్రారంభించారు. మునుగోడు ఉప ఎన్నికలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. తను గెలిచిన ఆరు నెలల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మరోసారి తనను గెలిపిస్తే పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులన్నీ పూ ర్తి చేసి మునుగోడును అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెంబర్వన నిలుపుతానని అన్నా రు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, ఎంపీపీలు మెండు మోహనరెడ్డి, కర్నాటి స్వామియాదవ్, పంచాయతీ రాజ్ డీఈ రఘుపతి, దళితబంధు జిల్లా కమిటీ సభ్యుడు లపంగి నర్సింహ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ బచ్చు రామకృష్ణ, నాయకులు రామిడి వెంకటరమణారెడ్డి, మునగాల అంతిరెడ్డి, అయితగోని వెంకన్నగౌడ్, మారగోని వెంకట్రాం, జేపీ ప్రసాద్, పురుషోత్తంరెడ్డి, గోవర్థనరెడ్డి, కృష్ణయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.