Minister Indrakaran Reddy : ఇప్పటికే పండ్లు, పూలు పెట్టుకున్నారు.. పుస్తె కట్టడమే తరువాయి

ABN , First Publish Date - 2023-04-12T15:54:14+05:30 IST

కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డిపై మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారంటూ ఇప్పటికే చర్చ బీభత్సంగా నడుస్తోంది.

Minister Indrakaran Reddy : ఇప్పటికే పండ్లు, పూలు పెట్టుకున్నారు.. పుస్తె కట్టడమే తరువాయి

నిర్మల్ : కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డిపై మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారంటూ ఇప్పటికే చర్చ బీభత్సంగా నడుస్తోంది. దీనికి అనుగుణంగానే ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మ‌హేశ్వర్ రెడ్డి నేడో...రేపో బీజేపీ లో చేర‌టం ఖాయమన్నారు. ఇప్పటికే పండ్లు, పూలు పెట్టుకున్నారని.. ఇక పుస్తె కట్టడం మాత్రమే మిగిలి ఉందన్నారు. గతంలో తాను చెప్పిన మాట నిజం కాబోతోందన్నారు.

కాగా.. నేడు మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టీపీసీసీ షో కాజ్ నోటీస్ ఇచ్చింది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఏ రోజు తాను పార్టీ గీత దాటలేదు. అంతర్గత సమావేశాల్లో మాత్రమే తాను మాట్లాడానన్నారు. రేవంత్ వెలమ కమ్యూనిటీ మీద మాట్లాడినప్పుడు మాత్రమే తాను మాట్లాడలేదన్నారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి అంటే తనకు అభిమానమన్నారు. సీనియర్ల మీటింగ్ తన ఇంట్లో ఉంటే దిగ్విజయ్ కోరిక మేరకు వాయిదా వేశామన్నారు. జనరల్ సెక్రటరీని మార్చమని తాము ఎప్పుడూ కోరలేదన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. షోకాజ్ ఇవ్వడం బాధాకరమన్నారు. ఖర్గేను కలిసి నిర్ణయం తీసుకుంటానన్నారు. తాను పార్టీ మారాలంటే బాజాప్త రాజీనామా చేసి వెళతానన్నారు. తాను పార్టీ మారాలని ఏ రోజు అనుకోలేదన్నారు. తన సమావేశాలకు బీజేపీ నేత అటెండ్ అయ్యారనేది పచ్చి అబద్ధమన్నారు. అమిత్ షాను బీజేపీ పెద్దలను కలిసేవారికి షోకాజ్ ఇచ్చే దైర్యం లేదన్నారు. కానీ నాకు ఎందుకు ఇచ్చారో అర్ధం కావడం లేదనిపేర్కొన్నారు.

Updated Date - 2023-04-12T15:54:14+05:30 IST