మేలో మందుబాబుల జోరు!
ABN , First Publish Date - 2023-06-02T02:37:51+05:30 IST
మే మాసంలో ఎండల తీవ్రతతో వేడెక్కిపోయిన మందుబాబులు బీరు బాటిళ్లను జోరుగా తాగి కూల్ అయినట్లు రాష్ట్ర ఆబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేశాయి.
రాష్ట్రంలో ఏరులై పారిన బీర్లు
రికార్డు స్థాయిలో 7.44 కోట్ల బీరు బాటిళ్ల అమ్మకాలు
హైదరాబాద్ సిటీ, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): మే మాసంలో ఎండల తీవ్రతతో వేడెక్కిపోయిన మందుబాబులు బీరు బాటిళ్లను జోరుగా తాగి కూల్ అయినట్లు రాష్ట్ర ఆబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేశాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా.. గత నెలలో బీర్లు అమ్ముడుపోయాయి. ఆ నెల రోజుల వ్యవధిలో సుమారు రూ. 3,300 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు జరగ్గా.. వాటిలో 64 లక్షల కేసుల(7.44 కోట్ల సీసాలు) బీర్లు తాగేశారు. ఇప్పటి వరకు 2019 మే నెలలో అత్యధికంగా బీర్ల విక్రయాలు జరిగాయని.. అప్పట్లో 60 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయని అధికారులు చెబుతున్నారు.