డిజైనర్ గీతాంజలి ‘ది ఆంటోరా’ను ఆవిష్కరించిన లక్ష్మీ మంచు

ABN , First Publish Date - 2023-04-19T23:38:47+05:30 IST

ప్రముఖ డిజైనర్ గీతాంజలి రూపొందించిన ఆంటోరా స్టోర్‌ను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నటి, నిర్మాత లక్ష్మీ మంచు ప్రారంభించారు. అనంతరం

డిజైనర్ గీతాంజలి ‘ది ఆంటోరా’ను ఆవిష్కరించిన లక్ష్మీ మంచు

హైదరాబాద్: ప్రముఖ డిజైనర్ గీతాంజలి రూపొందించిన ఆంటోరా స్టోర్‌ను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నటి, నిర్మాత లక్ష్మీ మంచు ప్రారంభించారు. అనంతరం ‘ది ఆంటోరా’ గురించి మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. ఇది భారతీయ లగ్జరీ డిజైనర్ దుస్తుల బ్రాండ్. డిజైనర్ గీతాంజలి యొక్క విజన్, ఒక ప్రముఖ డిజైనర్ దుస్తుల బ్రాండ్‌గా మారడం గొప్ప విషయం. ఇది భారతీయ దుస్తులు మరియు సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా ఉండటమే కాకుండా.. విభిన్న కస్టమర్ బేస్ యొక్క అవసరాలు, వారి కోరికలను తీర్చే ప్రత్యేకమైన డిజైన్ల ఈ బ్రాండ్ ప్రత్యేకత. ఆవిష్కరణ, నాణ్యత, నైతిక పద్ధతులతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా ‘ది ఆంటోరా’ని రూపొందించడానికి డిజైనర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ స్టోర్‌లో లెహంగాలు, చీరలు, సూట్లు, ఫ్యాబ్రిక్, కుర్తాలు, ఇండో వెస్ట్రన్, ఎథ్నిక్ దుస్తులు అన్నీ లభిస్తాయని వ్యవస్థాపకులు గీతాంజలి తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. ఈ బ్రాండ్ యొక్క మిషన్ ఉత్పత్తి, రూపకల్పన మరియు పరిశోధనలో బృందం యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించడంతో పాటు.. ఒక కథను చెప్పేలా మరియు స్థిరమైన దుస్తులను సృష్టించడం ఈ బ్రాండ్ ప్రత్యేకత అని తెలిపారు. క్లయింట్స్ మరియు ఉత్పత్తి బృందంతో సహకరించతో పాటు.. అధిక-నాణ్యత ఉత్పత్తులను సరసమైన ధరకు అందించడానికి, స్థానిక కమ్యూనిటీలు మరియు ఫ్యాషన్ పరిశ్రమ అభివృద్ధికి కూడా ఈ బ్రాండ్ దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఇంకా ఈ కార్యక్రమానికి ప్రముఖ నటీనటులు అక్షర గౌడ, తేజస్వి మదివాడ, డింపుల్ హయాతి, రాశి సింగ్, శివాత్మిక రాజశేఖర్, వితికా షెరు, సీరత్ కపూర్, పరిధి గులాటి, దివ్య బోపన్న, త్రిషాల కామత్ తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2023-04-19T23:38:47+05:30 IST