మిర్యాలగూడలో వ్యక్తి అదృశ్యం

ABN , First Publish Date - 2023-03-31T00:23:29+05:30 IST

మిర్యాగూడ పట్టణానికి చెందిన ఎండీ. గు లాం ముస్తఫా అదృశ్యమయ్యాడు.

 మిర్యాలగూడలో వ్యక్తి అదృశ్యం

మిర్యాలగూడలో వ్యక్తి అదృశ్యం

మిర్యాలగూడ అర్బన, మార్చి 30: మిర్యాగూడ పట్టణానికి చెందిన ఎండీ. గు లాం ముస్తఫా అదృశ్యమయ్యాడు. ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం... పట్ట ణంలోని శాంతినగర్‌లో నివాసముండే ముస్తఫా మతిస్థిమితం కోల్పోయి అడపాదడపా ఇంటి నుంచి వెళ్లి తిరిగి వచ్చేవాడు. ఈ నెల 27వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన ముస్తఫా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గురువారం టూటౌన పోలీస్‌స్టేష నలో ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 58 ఏళ్ల వయసున్న ముస్తఫా 5.5 అడుగుల ఎత్తు ఉంటాడని, నీలం రంగు టీషర్ట్‌, లుంగీ ధరించాడన్నా రు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషనలో సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.

Updated Date - 2023-03-31T00:23:29+05:30 IST