పర్యాటక స్థలాల లీజు అవకతవకలను సమీక్షిస్తాం
ABN , First Publish Date - 2023-12-11T03:45:53+05:30 IST
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి జూపల్లి
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక స్థలాల లీజు అవకతవకలను సమీక్షిస్తామని చెప్పారు. ఆదివారం సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్లో పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రిగా జూపల్లి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏళ్లుగా వేతనాలు అందని సాంస్కృతిక కళాకారులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన పర్యాటక సాంస్కృతిక, పురావస్తు శాఖకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.