K Viswanath : మరణానికి కొన్ని క్షణాల ముందు పాట రాస్తూ..

ABN , First Publish Date - 2023-02-03T08:51:05+05:30 IST

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్‌ కన్ను మూశారు. అయితే ఆయన మరణం చివరి క్షణాల వరకూ కూడా కళామతల్లి సేవలోనే గడిపారు.

K Viswanath : మరణానికి కొన్ని క్షణాల ముందు పాట రాస్తూ..

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్‌ కన్ను మూశారు. అయితే ఆయన మరణం చివరి క్షణాల వరకూ కూడా కళామతల్లి సేవలోనే గడిపారు. మరణానికి కొన్ని క్షణాల ముందు పాట రాస్తూ.. ఇక రాయలేక దానిని కుమారుడి చేతికందించి పాట పూర్తి చేయమని చెప్పారు. ఆయన రాస్తుండగానే విశ్వనాథ్ కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రిలో రాత్రి తుదిశ్వాస విడిచారు. కె విశ్వనాథ్ పూర్తిపేరు కాశీనాధుని విశ్వనాథ్‌. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెదపులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వత్మ దంపతులకు విశ్వనాథ్‌ జన్మించారు. కె.విశ్వనాథ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. విశ్వనాథ్‌ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Updated Date - 2023-02-03T08:52:35+05:30 IST