రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటీ సోదాలు!
ABN , First Publish Date - 2023-03-01T03:36:21+05:30 IST
రియల్ ఎస్టేట్ కంపెనీలే లక్ష్యంగా హైదారాబాద్లో మరోసారి ఐటీ సోదాలు జరిగాయి. దాదాపు 20 చోట్ల ఏకకాలంలో ఆదాయ పన్ను(ఐటీ)
హైదరాబాద్, దిల్సుఖ్నగర్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రియల్ ఎస్టేట్ కంపెనీలే లక్ష్యంగా హైదారాబాద్లో మరోసారి ఐటీ సోదాలు జరిగాయి. దాదాపు 20 చోట్ల ఏకకాలంలో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో, దిల్సుఖనగర్లోని గూగీ రియల్ ఎస్టేట్ కంపెనీ సహా రాయల్ సిటీ, వండర్ సిటీ, ఫార్మా హిల్స్ వంటి రియల్ ఎస్టేట్ కంపెనీల్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు జరిగాయి. పలు రియల్ ఎస్టేట్ సంస్థలు అడ్వాన్స్ బుకింగ్ల పేర కస్టమర్ల నుంచి సొమ్మును వసూలు చేస్తున్నాయని, కానీ వాటికి రిటర్నులు దాఖలు చేయడం లేదని, పన్ను చెల్లించడం లేదని ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు. అందుకే పలు కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నామని, అ నుమానాలు తలెత్తినప్పుడల్లా తనిఖీలు సర్వసాధారణమని తెలిపారు.