హామీలు అమలు చేయలేక అప్పుల రాష్ట్రం అంటూ బద్నాం చేసే ప్రయత్నం
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:45 AM
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 60 హామీలు ఇచ్చిందని.. వాటిని అమలు చేయలేక అప్పుల రాష్ట్రం అంటూ బద్నాం చే సే ప్రయత్నం చేస్తోందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్
సిరిసిల్ల టౌన్, డిసెంబరు 17: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 60 హామీలు ఇచ్చిందని.. వాటిని అమలు చేయలేక అప్పుల రాష్ట్రం అంటూ బద్నాం చే సే ప్రయత్నం చేస్తోందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. అప్పులు.. అప్పులు అంటూ సీఎం రేవంత్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని.. పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యేనని సంజయ్ అనడం హాస్యాస్పదమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బలమైన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. బీజేపీకి కాంగ్రెస్ సపోర్టు చేయడంతోనే గతంలో అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీ ఎంపీలు గెలిచారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు పోతాయని, కరీంనగర్లో సంజయ్ను ఎదుర్కొంటామని చెప్పారు. తాము ఉద్యోగుల జీతాలు ఎగవేయలేదని, పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంతో ఉద్యోగుల జీతాలు ఐదు రోజులు ఆలస్యమయ్యాయన్నారు.