నేడు ఐసెట్ పరీక్ష ప్రారంభం
ABN , First Publish Date - 2023-05-26T04:07:40+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో 2023–24 ఏడాదికి అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న టీఎస్ ఐసెట్–23 ప్రవేశ

కేయూ క్యాంపస్/హైదరాబాద్ సిటీ, మే 25: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో 2023–24 ఏడాదికి అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న టీఎస్ ఐసెట్–23 ప్రవేశ పరీక్ష నేడు ప్రారంభం కానుంది. శుక్ర, శనివారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున నాలుగు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వరలక్ష్మి తెలిపారు. కాగా, ఈ నెల 29 నుంచి జూన్ 1 వరకు జరగనున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్) నిర్వహణకు సంబంఽధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి. రవీంద్రారెడ్డి తెలిపారు.