పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:42 PM
జిల్లాకేంద్రంలో జరిగిన అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్)ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు.
సూర్యాపేటటౌన్, డిసెంబరు 26: జిల్లాకేంద్రంలో జరిగిన అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్)ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని విక్రమ్ భవన్లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వంలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అధికారులు, కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నాయకులు కుమ్మకై ప్రజలను సొమ్మును లూటీ చేశారని ఆరోపించారు. జిల్లాకేంద్రంలో జరిగిన కాంట్రాక్ట్ పనులు ఒకే వ్యక్తికి కట్టబెట్టడంలో అంతర్యం ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టిపల్లి అంజయ్య, కొత్తపల్లి రేణుక, ఎర్ర అఖిల్కుమార్, పేర్ల నాగయ్య, లక్ష్మయ్య, నర్సయ్య, భూక్యారాంజీ, పద్మ, జీవన్ తదితరులు పాల్గొన్నారు.